నిత్యాభిషేకం…సహస్ర లింగం!!!!

కర్నాటక రాష్ట్రంలో ఉత్తరకన్నడ జిల్లాలో గల సిరిసి ప్రాంతానికి 17కిలోమీటర్ల దూరంలో, పశ్చిమఘాట్ లో, అడవి మధ్యలో సహస్రలింగ అనే ప్రాంతం ఉన్నది. అక్కడ శల్మలా అనే నదిలో రాళ్లలో శిలలలో చెక్కబడిన వందలాది శివలింగాలను మనం తిలకించవచ్చు. అయితే, అవి ఎవరు చెక్కినవి అనేది ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు, అయితే, కొందరు మాత్రం ఈ లింగాలు 1678 – 1718 నాటి సిరిసి రాజు సదాశివరాయుడు నిర్మింపచేశాడు అని చెపుతుంటారు.