నిత్యాభిషేకం…సహస్ర లింగం!!!!

కర్నాటక రాష్ట్రంలో ఉత్తరకన్నడ జిల్లాలో గల సిరిసి ప్రాంతానికి 17కిలోమీటర్ల దూరంలో, పశ్చిమఘాట్ లో, అడవి మధ్యలో సహస్రలింగ అనే ప్రాంతం ఉన్నది.sahasra_linga

అక్కడ శల్మలా అనే నదిలో రాళ్లలో శిలలలో చెక్కబడిన వందలాది శివలింగాలను మనం తిలకించవచ్చు.

అయితే, అవి ఎవరు చెక్కినవి అనేది ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు, అయితే, కొందరు మాత్రం ఈ లింగాలు 1678 – 1718 నాటి సిరిసి రాజు సదాశివరాయుడు నిర్మింపచేశాడు అని చెపుతుంటారు.

శివలింగాల ఎదురుగా బసవన్న విగ్రహాలు కూడా చెక్కి వుండడం విశేషం.

శివరాత్రి పర్వదినాన ఇక్కడికి వేలాది మంది భక్తులు తరలివచ్చి, పూజలు చేసుకుంటారు. ఆ సమయంలో ఇక్కడ ప్రవాహం తక్కువగా ఉండడం విశేషం. అందువలన ఎక్కువ శివలింగాలను దర్శించుకునే అవకాశం కలుగుతుంది.

ఈ శివలింగాలు, ఆ నదీ ప్రవాహంతో నిత్యం అభిషేకించబడుతూ ఉంటాయి.

– భారత్ టుడే

 

Leave a Comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.